ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో ప్రత్యేకవైద్య నిపుణుల చేత వైద్య శిభిరం నిర్వహించినట్లు వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సతీష్ కుమార్ తెలిపారు. ఈ ప్రత్యేక వైద్య శిభిరం లో ఆర్థోపెడిక్ వైద్యుడు ప్రవీణ్, గైనకాలజిస్ట్ రవళి , పిడియాట్రిక్ సాహితి , జనరల్ మెడిసిన్ సాయి పవన్ , డెంటిస్ట్ డాక్టర్ షబ్బీర్ లు 210 మందికి ఔట్ పేషెంట్ సేవలను అందజేశారు. ఈ వైద్య శిభిరం లో హెచ్ఈఓ జే.దేవేందర్ , హెల్త్ సూపర్ వైజర్లు శోభ , మార్త, నర్సింగ్ ఆఫీసర్ సుమలత , ఫార్మాసిస్ట్ సుష్మ, హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, వేణు, ఇసాక్ అహ్మద్, ల్యాబ్ టెక్నీషియన్ రాజన్న , ఎంఎల్ హెచ్ పిలు మరియు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Admin
E Nivas News