ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లామందమర్రి పట్టణంలోని సి ఈ ఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సీనియర్ జర్నలిస్టు మునీర్ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన మునీర్ భాయ్ ( ప్రొలిటేరియన్ జర్నలిస్టు ) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆదివారం ప్రొ" కోదండ రామ్,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుతో కలిసి పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా" గడ్డం వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ముందుగా మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ మునీర్ తో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వారి సేవలను స్మరించుకున్నారు. మునీర్ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి జేఏసీ ఛైర్మన్ గా కార్మిక లోకాన్ని ఏకం చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
Admin
E Nivas News