ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, రాష్ట్ర పరిశ్రమల మంత్రివర్యులు టీ.జీ.భరత్ గుప్త ని, మాజీ రాజ్యసభ సభ్యుడు టి.జీ.వెంకటేష్ లను టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు,జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితర నాయకులు కర్నూలు జిల్లా అడ్వకేట్లు అసోసియేషన్ తరపున మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి, బొకేలు చేతికి అందించి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, తదితరులు మాట్లాడుతూ మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు యువగళం యాత్రలో కర్నూలు కి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మొన్న కర్నూలు కి వచ్చినప్పుడు 90 రోజులలోపు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట మీద నిలపడడం అది టిడిపి ప్రభుత్వానికే సాధ్యమని తెలియజేస్తున్నాననీ అన్నారు. టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగదీష్, దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, మా తరపున మరియు మా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ నాయకుల తరఫున కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ గుప్తా లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు విక్రమ్ సింగ్, సుమంత్, ప్రభాకర్, అవినాష్, బాణాల రాజు, మోహన్ బాబు, బడేసాబ్, మద్దెస్, గోవిందు, మురళి నాయుడు, బి.చంద్రుడు, బిఎస్.రవికాంత్ ప్రసాద్, పి.రవి గుణేరా, రంగా రవికుమార్, శ్రీనివాస్ బట్, ఏ.మాడన్న సింగ్, సీనియర్, జూనియర్ నాయకులు గణేష్ సింగ్, ఈ.రాజేష్, జహంగీర్ భాష, మహిళా న్యాయవాదులు జయలక్ష్మి, కరుణ జ్యోతి, సుమన రాణి, జనసేన, బిజెపి, టిడిపి, టిడిపి న్యాయవాదులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News