ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లాలోని, పాములపాడు గ్రామానికి చెందిన రైతు కురువ ఎల్లయ్య మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెందిన సర్వే నెం. 261లో 21 ఎకరాల 64 సెంట్ల భూమి మాత్రమే ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో 25 ఎకరాల 14 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారని తెలిపారు. అంతే కాకుండా, అదే సర్వే నంబర్లో 4 ఎకరాల 50 సెంట్ల భూమిని ఇతరుల పేర్లపై నమోదు చేసి ఆన్లైన్ పట్టాదారు పాస్బుక్కులు జారీ చేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా, సర్వే నెం. 43/3లో 50 సెంట్ల భూమిని కొనుగోలు చేయగా, నేషనల్ హైవే రోడ్డులో 31 సెంట్లు భూసేకరణకు పోగా, మిగిలిన 19 సెంట్లు మాత్రమే ఉండాలి, కానీ రెవెన్యూ రికార్డుల్లో 29 సెంట్లు ఉన్నట్లు చూపిస్తున్నారన్నారు. ఈ కారణంగా ఆత్మకూరు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదని తెలిపారు. ఈ రెండు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో ద్వారా ఫిర్యాదులు అందజేసినా, గత ఒక సంవత్సరం కాలంగా గ్రామ విఆర్ఓ, తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి పరిష్కారం లభించలేదని అన్నారు. సమస్యకు సంబంధించిన అన్ని సరైన డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధారాలు అధికారులకు పలుమార్లు చూపించినప్పటికీ సమస్యను పరిష్కరించడం లేదు. ప్రతి సారి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న కానీ, సమస్య పరిష్కారం కాకపోగా ప్రయాణ ఖర్చులు పెరుగుతున్నాయనీ అన్నారు. సమయం వృథా కూడా వృధా అవుతోందనీ అన్నారు. అయినప్పటికీ తమ సమస్యను అధికారులు అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదన్నారు. అసలు సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదో కూడా తమకు తెలియడం లేదని కురువ ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఈ తప్పులను వెంటనే సరిచేసి, బాధ్యులపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను, రెవెన్యూ ఉన్నతాధికారులను రైతు కురువ ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News