ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : అదితి చిరుధాన్యాల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని, టీ.జీ.వి. కళాక్షేత్రం లో ఈ రోజు నిర్వహించిన చిరుధాన్యాలపై అవగాహన సదస్సులో పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. 1000 మందికి పైగా రైతులు మిల్లెట్ వినియోగదారులు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన డాక్టర్ ఖాదర్ వలి చిరుధాన్యాల్లో గట్ మైక్రోబ్స్ను పెంచే సహజ గుణాలు, అధిక ఫైబర్, అలాగే రక్తంలో ఏర్పడే థిక్కెనింగ్ (రక్తం గడ్డ కావడం)ను తగ్గించే లక్షణాలను వివరించారు. చిరుధాన్యాలు రోజువారీ ఆహారంలో భాగం అయితే జీవనశైలిలో గణనీయమైన మార్పు వస్తుందని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డి హాజరై, ఆరోగ్యం కోసం చిరుధాన్యాల వినియోగం పెరగాల్సిన అవసరాన్ని చెప్పారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, టి.జి. జగదీష్, మరియు అదితి మిల్లెట్స్ వ్యవస్థాపకులు సిఎ- కడింపల్లి.మోహన్, పోతుల.శేఖర్ పాల్గొన్నారు. అదితి మిల్లెట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ సంస్థకు కర్నూలులోనే స్వంతంగా మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండి, 200 మంది రైతులతో పని చేస్తూ, ప్రాసెస్ చేసి చిరుధాన్యాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని అన్నారు.
Admin
E Nivas News