ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : ఫేస్ యాప్ రద్దు చేయాలి..?ప్రభుత్వం నిర్ణయించిన రోజు వారి కూలీ జాతీయ ఉపాధి హామీ శ్రామికులకు రూ 600 కనీసం వేతనం ఇవ్వాలని..? సి.పి.ఐ (ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు..? నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని, రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులను మంగళవారం రోజు సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ కార్మికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలని దీని ద్వారా నెట్ లేకపోవడంతో శ్రామికులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని,ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీ శ్రామికునికి రోజు వారి కూలి రూ 600 ఇవ్వాలని అలాగే సంవత్సరంలో 200 రోజులు పని దినాలను కల్పించాలని,125 రోజులు పని దినాలు పెరిగిన కేవలం100 మాత్రమే పని దినాలను పని దినాలను కల్పించారని అన్నారు. అలాగే ప్రతి వ్యవసాయ కూలీకి 125 రోజులు పని చూపే విధంగా చూడాలని అన్నారు. పని చేసే చోట మజ్జిగ,మెడికల్ కిట్లు, గ్రామానికి కి.మి 5 లోపు ఉంటే శ్రామికులకు రవాణా చార్జీలు ఇవ్వాలని అన్నారు. సమ్మర్ వేసవి అలవెన్స్ 30% కలపాలని అన్నారు.100 రోజులు పని చేసిన శ్రామికులకు పని ముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు,వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News