ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షంతో పలు పట్టణాలతో పాటు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న వాగులు వంకలు నిండిపోయి భయంకరంగా ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా పళ్ళు జిల్లాలలో రహదారులపై చిన్న చిన్న కల్లబట్టులు ఉండడంతో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ వరంగల్ తదితర జిల్లాలలోని గ్రామాలలో చాలావరకు చెరువులు వాగులు కూడా ఉప్పంగడంతో పక్కనే ఉన్న పంటపొలాలన్నీ నీటితో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు ఎల్ డినో ప్రభావంతో వర్షాలు కురువకపోవడంతో ఆందోళన చెందిన రైతులు ఒకే ఒక్క రోజు కురిసిన భారీ వర్షానికి ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. ఆటో పత్తి చేలలో కూడా మొక్కలు నీరు నిలవడంతో కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో వర్షం పడడంతో సంతోషం వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేయడం కనబడింది. ఈ వర్షంతో నిన్నటి వరకు ఎండిపోయి ఉన్న వాగు వంకలు అన్నీ కూడా ఒకేసారి భారీ వర్షం కురవడంతో నీటితో నుండి కళకళలాడుతున్నాయి.
Admin
E Nivas News