Friday, 31 July 2026 07:11:17 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రభుత్వ గెజిట్‌లో ‘నేతకాని’ కుల పేరు సవరణ చేయాలి... మంత్రి వివేక్‌ను కోరిన నేతకాని సేవా సంఘం నాయకులు..

Date : 11 May 2026 08:39 PM Views : 84

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నేతకాని (మహర్) సేవా సంఘం ప్రతినిధులు రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని సోమవారం కలిసి ప్రభుత్వ గెజిట్ మరియు అధికారిక రికార్డుల్లో “నేతకాని” కుల పేరును సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం కొన్ని అధికారిక పత్రాలు, నమోదు ప్రక్రియల్లో “నేతకాని”కు బదులుగా “మలసాలె,నెట్కాని”గా నమోదు అవుతోందని, ఇది తప్పుగా నమోదవుతోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దీనివల్ల సమాజానికి చెందిన ప్రజలు పలుఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం స్వామి, దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి సమర్పించిన వినతిపత్రంలో నేతకాని కులానికి చెందిన ప్రజలు ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారని వివరించారు. అధికారిక రికార్డులు, గెజిట్ ప్రకటనలు, కుల ధృవీకరణ పత్రాల్లో “నేతకాని” పేరునే ఏకరీతిగా నమోదు అయ్యేలా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సంబంధిత అధికారులతో ఈ విషయాన్ని చర్చించి అవసరమైన సవరణలు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :