ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. భర్తే పథకం ప్రకారం భార్యను హత్య చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బొమ్మెన మౌనిక అలియాస్ నల్ల మౌనిక అదృశ్యమైనట్లు ఈ నెల 9న మిస్సింగ్ కేసు నమోదైంది. మే 14న అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమవడంతో హత్య కేసుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణలో భర్త నల్ల అరుణ్పై అనుమానం వ్యక్తమైంది. అదనపు కట్నం వేధింపులు, కుటుంబవిభేదాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో భర్త భార్యను హత్య చేసినట్లు తేలింది.
Admin
E Nivas News