ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఈ నెల 19వ తేదిన ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా కాటారం మండల కేంద్రంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయనున్నట్లు కమిటీ సభ్యులు పవిత్రం శ్రీనివాస్ మాట్లాడుతూ ఛత్ర పతి శివాజీ మహారాజ్ భారత దేశ చరిత్రలో గొప్ప వీరుడు, సంవర్దమంతమైన పాలకుడు అని ప్రజల సంక్షేమాన్ని కోరుకునేవారు అని అ న్నారు, శివాజీ ధైర్యం తెలివితేటలు నైపుణ్యం కలవాడు మహిళల పట్ల గౌరవ చూపేవారన్నారు. అలాగే కాటారం మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో వ్యాస రచన మరియు డ్రా యింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అందులో భాగంగా శనివా రం ఉదయం స్థానిక సర్పంచ్ పంతకాని సడవాలినీ ఈ ఉత్సవాలకు రావాలని కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అలాగే ఆదర్శనగర్ కాలనీ వాసులకను, శ్రీపాద కాలనీ వాసులను, గణేష్ నగర్ కాలనీ వాసులను ఈ ఉత్సవాలలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కమిటీ సభ్యులు కోట్టే శంకరయ్య, పవిత్రం శ్రీనివాస్, ఉన్నం అంజయ్య, చీమల రాజు, గోనె మహేష్, మారగోని సంతోష్, కోట్టే సతీష్,పసుల సందీప్, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News