Friday, 31 July 2026 12:45:03 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు..

సజ్జనార్ నేతృత్వంలో దర్యాప్తు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Date : 13 January 2026 11:24 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా ఆరోపణలు చేస్తూ వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో 8 మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారిపై నిరాధార ఆరోపణలు చేస్తూ పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా మార్పులు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై కూడా మరో కేసు నమోదైంది. ఈ రెండు అంశాలపైనా సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్‌కు బాధ్యతలు అప్పగించింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫాంలను దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :