Friday, 31 July 2026 07:08:42 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

భారీ పెట్టుబడి మోసం కేసులో కీలక నిందితురాలు అరెస్ట్

Date : 25 April 2026 11:13 PM Views : 201

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్ల కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. “డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ” పేరిట నకిలీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను పెట్టుబడులు పెట్టమని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలు థాకూర్ శివరంజని బాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ శనివారం తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎస్పీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. 5 శాతం నుండి 20 శాతం వరకు లాభాలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారు. వీరిలో థాకూర్ శివరంజని బాయి అరెస్టు కాగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితురాలిని ఏప్రిల్ 24న సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా, ఈ నిందితులు గతంలో కూడా వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డట్లు బయటపడింది. కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, లల్లగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లువెల్లడించారు.2021 ఆగస్టు నుండి 2023 జనవరి మధ్యకాలంలో కాగజ్‌నగర్ పట్టణంలో నివసిస్తూ ప్రజలను నమ్మబలికి డబ్బులు తీసుకుని పరారైనట్లు సమాచారం.ఇప్పటివరకు మరికొందరు బాధితులు కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారని పోలీసులు తెలిపారు.ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజు, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మి, జోష్ణ, బ్లెస్సి, శమీనా, కానిస్టేబుల్ విజయ్‌లను ఎస్పీ అభినందించారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :