ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ చైర్మన్ దొంత అంజలి నరసయ్య సోమవారం 13వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకట స్వామి గౌడ్ , 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ, ఇంటింటా తిరిగారు. వీరితోపాటు ఎండి ఆరిఫ్, కౌన్సిలర్లు గోప సుజాత రమేష్, రాజు, హఫీజ్, హాజీ ఆరే శ్రీను, నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News