ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ఆవిష్కరణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇండ్లు లేదని హనుమంతుని గుడి లేని ఊరు లేదని అన్నారు. గ్రామానికి అండగా ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉంటుందని అన్నారు. ఈరోజు గంగాపూర్ గ్రామం చిన్న గ్రామమైన భక్తి శ్రద్ధలతో గ్రామంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. ఆలస్యంగా కట్టిన గంగాపూర్ గ్రామస్తులు అద్భుతంగా నిర్మించారని,కలియుగంలో గ్రామాలు బాగుండాలని కలిని తొక్కడానికే ఆంజనేయ స్వామిగా శివుడు అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News