ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ప్రతి షాపుకు వెళ్లి వ్యాపారస్తులకు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావులు సోమవారం సాయంత్రం వ్యాపారస్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. .ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు తిప్పని లింగయ్య. కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచుచిన్నయ్య, మున్సి పల్ మాజీ చైర్మన్ నలమాసుకాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్య క్షుడు పాదం శ్రీనివాస్, నాయకులు అంకతి గంగాధర్, పెట్టెం తిరుపతి, మైనార్టీ నాయకులు షేక్ చాంద్ ఓడగంటి శ్రీకాంత్, మెట్టు రాజు, పాల్గొన్నారు.
Admin
E Nivas News