ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులను నియంత్రించాలని కోరుతూ సోమవారం డిఆర్ఎస్పి విద్యార్థి విభాగంలో జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టబి ఆర్ఎస్వి నాయకుడు దగ్గుల మధుకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బి ఆర్ ఎస్ విమంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేవలం ధనార్జనే ద్యేయంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూన్న ప్రభుత్వం ఏ మాత్రంపట్టించుకోకుండా విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసుపలుకుతున్నాయన్నారు. అధిక ఫీజుల వసూలుకు నియంత్రణ కోసం కమిటీ వేస్తాం అని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు కమిటీ వేయకపోవడం కార్పొరేట్ వ్యవస్థకు ఆజ్యం పోస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వారిని పరిష్కారం చేయాలి అని బి ఆర్ ఎస్ వి డిమాండ్ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బి ఆర్ ఎస్ వి నాయకులు అరుణ్ రిషి,నార్ల వంశీ,నక్క తిరుపతి,సాజిద్,బెల్లంతో అరుణ్,కంపెల్లి శ్రీకాంత్,జిలకర మహేష్,చంద్ర కిరణ్,లక్ష్మీకాంత్ రాజేందర్ బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్ధర్తి సుమంత్,కార్యదర్శి వడ్డేపల్లి నితీష్, బి ఆర్ ఎస్ వి నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News