Thursday, 30 July 2026 04:51:26 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అభ్యాస నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాలి

Date : 03 July 2026 06:55 PM Views : 84

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి ఉపాధ్యాయుడు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని విద్యార్థుల అభ్యాస స్థాయిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డా. పి. ఎం. షేక్ లు సూచించారు. మంథని మండలంలోని ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. మొదటగా ఎం.పి.పి.ఎస్. గౌతమీనగర్ పాఠశాలలో FLN (Foundational Literacy & Numeracy) అమలు, బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించి వారి అభ్యాస స్థాయిని అంచనా వేశారు. అలాగే ప్రీ-ప్రైమరీ విభాగాన్ని సందర్శించి చిన్నారుల అభ్యాస కార్యకలాపాలను పరిశీలించారు. FLN లక్ష్యాల సాధనకు అవసరమైన పలు సూచనలు, సలహాలు అందించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంథనిలో Learning Improvement Programme (LIP) అమలు తీరును పరిశీలించి విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించి అభ్యాస ఫలితాలను సమీక్షించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అభ్యాస పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాల మెరుగుదల, విద్యార్థుల అభ్యాస ఫలితాల పెంపు, LIP సమర్థవంతమైన అమలు, తరగతి గది బోధనలో నాణ్యత పెంపు, నిరంతర మూల్యాంకనం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి విలువైన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంథని మండల విద్యాధికారి శ్రీమతి లక్ష్మి, CRP లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :