Wednesday, 17 June 2026 01:43:52 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

పాడి రైతులు పశువులకు తప్పనిసరిగా టీకా వేయించాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 March 2026 10:14 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . మంగళవారం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమానికి జిల్లా పశువైద్య శాఖ అధికారి యాకుబ్ రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక అభివృద్ధి, పశువుల సంక్షేమం దిశగా ప్రభుత్వం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, గత సంవత్సరం 100 శాతం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. పాడిపశువులు, మేకలు, గొర్రెలు, పౌల్ట్రీ పారాలలో గాలికుంటు వ్యాధి నివారణ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అవసరమైన మందులను అందిస్తుందని, జిల్లాలో పశు వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారని, పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.

రైతులు వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమను నిర్వహిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించే దిశగా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు, ప్రణాళికలను,లైవ్ స్టాక్ పథకంలో ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుందని తెలిపారు. గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రయం పొందుతున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, నర్సరీ లను సందర్శించి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హత గల ప్రతి ఒక్కరికి అందించాలని,నర్సరీలలో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని ద్వారక గ్రామంలో గల షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను సందర్శించి పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు,మధ్యాహ్న భోజనం నాణ్యత,విద్యాబోధన తీరు అంశాలను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించడంతో పాటు నాణ్యమైన విద్య బోధన చేయాలని, వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం గ్రామంలోని గోదావరి నది తీరం సమీపంలో పుష్కర ఘాట్ ఏర్పాటుపై అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వెల్గనూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల స్థలానికి పరిశీలించి నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, విద్యాబోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాన్ని పరిశీలించి పల్లెదవాఖానను సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందుల నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని,వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మండలంలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మండల తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి సందర్శించి ఆలయ అభివృద్ధి, వాహనాల పార్కింగ్ అంశాలను పరిశీలించి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా అవసరమైన భూములను పరిశీలించి వివరాలతో నివేదిక అందించాలనిఅధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఆర్ జీ వి జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, గ్రామం సర్పంచ్ ఉప సర్పంచ్ కారుకురి తిరుపతి, వార్డు సభ్యులు, గ్రామం సీనియర్ నాయకులు ముద్ధసాని వేణు, తిరుపతి, ముత్తె వేంకటేష్,మల్లేష్, మోటపలుకుల సత్తయ్య, కమలాకర్, గోపతి రవి, తిరుపతి, జనార్ధన్ రెడ్డి, సుద్దపల్లి వేంకటేష్, గోల్ల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :