ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేట గ్రామ పంచాయతీకి చెందిన తాళ్లపల్లి లక్ష్మయ్య వడదెబ్బకు మృతి చెందడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంకట్రావు పేట గ్రామపంచాయతీలో గత 31 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వర్తిస్తున్న తాళ్లపల్లి లచ్చయ్య మూడు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య గ్రామపంచాయతీకి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని లచ్చయ్య ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీ పలకవర్గం సభ్యులు ఆయన కుటుంబానికి విరాళాలు అందజేశారు. గ్రామపంచాయతీ నుంచి లచ్చయ్య కుటుంబానికి 10,000, సర్పంచ్ నలిమెల రాజు వ్యక్తిగతంగా 5000, పాలకవర్గ సభ్యులు మీసా శ్రీనివాస్ 2000, బోడ కుంటి మారుతి 2000, దాసరి ఏసు మని1000, అంకతి వెంకటేష్ 1000, బెడగం రామయ్య 1000, తోట దివ్యసాగర్ 1000 వీఆర్ఏ కన్లే విజయ 500, పంచాయతీ కార్యదర్శి వంశి కృష్ణ 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు మానవత్వాన్ని చాటుకున్నారు.
Admin
E Nivas News