ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకాగజ్నగర్ X రోడ్డు వద్ద ఉన్న శ్రీనిధి జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర లభించేలా చూడాలని పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, సీపీఓ వెంగల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News