Thursday, 30 July 2026 04:02:40 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు

గోదావరిఖని ఏసిపి మడత రమేష్

Date : 28 July 2026 11:02 PM Views : 31

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లు, అనుమానితులకు టాబ్లెట్స్ ఇస్తె చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్ యజమానులకు గోదావరిఖని ఏసిపి మడత రమేష్ సూచించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో మెడికల్ దుకాణ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపి మడత రమేష్ మాట్లాడుతూ సోమవారం రాత్రి మంథనిలోని తమ్మి చెరువు కట్టపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారని, పెట్రోలింగ్లో భాగంగా కానిస్టేబుల్స్ తనిఖీ చేయగ వారి వద్ద టాబ్లెట్లు, సిరంజీలు లభించాయన్నారు. పట్టుకున్న వారిని విచారించగా వారికి గంజాయి సేవించే అలవాటు ఉందని, అది లభించకపోవడంతో మత్తు కొరకు మెడికల్ షాప్ లో కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేసి వాటిని నీటిలో కలిపి ఇంజక్షన్ ద్వారా తీసుకుంటున్నట్లు తెలిపారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఏసిపి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడితే జరిగే అనర్థాలపై మత్తు పదార్థాలకు బానిసలైన యువకుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అక్రమంగా మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ బుద్దే స్వామి, SI సందీప్ కుమార్, సిబ్బంది, మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :