ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో వరి ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు బియ్యం నిల్వలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని వారాలుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ బియ్యంతో పాటు సన్నబియ్యం, ప్రీమియం రకాల ధరలుకూడాపెరగడంతో వినియోగదారులపై అదనపు పడిందంటున్నారు. 26 కిలోల బస్తా ధరలో రూ.100 నుంచి రూ.300 వరకు పెరుగుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.3 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.ఎగుమతుల పెరుగుదల, ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగావ్యాపారులు చెబుతున్నారు.వ్యాపారులుకృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలుజరగకుండా అధికారులు బియ్యం మార్కెట్లపై నిఘా పెంచారు. నిల్వలు, సరఫరాపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ మరింత పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రభావంతో సామాన్యుడికి నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయడానికి కష్టతరంగానే మారుతున్నాయి అనడంలో సందేహం లేదని అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.
Admin
E Nivas News