Thursday, 30 July 2026 04:51:20 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అవినీతి వలలో మరో చేప చిక్కింది..

రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ ఇంజనీర్.

Date : 14 July 2026 10:07 PM Views : 77

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారంఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలోపెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లుఅధికారులు తెలిపారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ కోసం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో పెద్దపల్లి కలకలంరేగింది. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఏసీబీ అధికారులు ప్రతి నెలలో కొంతమంది అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్న కూడా ఇంకా లంచం తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలా లంచాలకు ఎగబడితే మామూలు ప్రజల పరిస్థితి ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏసీబీకి పట్టుబడిన అధికారులను ఉద్యోగాల నుండి తొలగిస్తే నన్న మార్పు వస్తుందేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :