ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారంఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలోపెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సతీష్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన పనుల బిల్లును విడుదల చేయడానికి కాంట్రాక్టర్ బత్తుల శ్రీను నుంచి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నట్లుఅధికారులు తెలిపారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డితో పాటు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ ఏఈ సతీష్ ను ఆయన ఇంటి వద్ద పట్టుకున్న అధికారులు, అనంతరం విచారణ కోసం మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.అక్కడ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో పెద్దపల్లి కలకలంరేగింది. అవినీతికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఏసీబీ అధికారులు ప్రతి నెలలో కొంతమంది అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్న కూడా ఇంకా లంచం తీసుకుంటున్న వారి సంఖ్య తగ్గడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇలా లంచాలకు ఎగబడితే మామూలు ప్రజల పరిస్థితి ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏసీబీకి పట్టుబడిన అధికారులను ఉద్యోగాల నుండి తొలగిస్తే నన్న మార్పు వస్తుందేమోనని పలువురు చర్చించుకుంటున్నారు.
Admin
E Nivas News