ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుక లను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హమాలి సంఘం వద్ద గల గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు కలిసి పులిహోర ప్యాకెట్, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్ మాట్లాడుతూ దేశానికి గాంధీ చేసిన సేవల ను, ఆయన అహింస మార్గాన్ని కొనియాడుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. వాసవి క్లబ్ కాటా రం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్ మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆ యుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్రాలు అందించిన మహనీయుడు జాతి పిత మహాత్మాగాంధీ అని అన్నాడు. సర్వజన హితం నామతం. అంటరానితనాన్ని అంత కలహాలను అంతం చేసేందుకు నా ఆయువు అంకితం అంటూ జాతి పిత మహాత్మాగాంధీ సందేశం ఇచ్చారని, నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్య్రం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాటారం గ్రామ సర్పంచ్ పంత కాని సడవలి, ఉప సర్పంచ్ కొండగొర్ల బానయ్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది నవీన్ కుమార్, కోశాధికారి దారం నందకిషోర్, వాసవి క్ల బ్ కాటారం అధ్యక్షుడు మద్ది కమల మనోహర్, ప్రధాన కార్యదర్శి అల్లాడి ఓం ప్రకాష్, కోశాధికారి మద్ది సంపత్, ఆర్యవైశ్య సంఘం సబ్యులు, వాసవి క్లబ్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News