ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఆశ్వీయుజ మాసంలో కారు చీకట్లలో వెలుగులు నింపే దీపావళి పర్వదినం ఎంతో పవిత్రమైన పండుగ. సోమవారం రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి పూజలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. దేవతల కోరిక మేరకు నరకాసురుని సంహరించిన రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పూర్వం కృతయుగంలో ఒకనాడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమహాలక్ష్మిని లోకశ్రేయస్సు కోసం ప్రార్ధన చేయగా అమ్మ ప్రత్యక్షమై నేను లోక సంచారము చేయటానికి వెళ్తాను అని ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు లోక సంచారమునకు వచ్చింది.అమ్మ ఏకకాలంలో లోకమంత నిండిపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా స్నానం లేదు, శుచీ శుభ్రత లేదు. అలా వెళ్తున్న అమ్మకు కశ్యప ప్రజాపతి గోశాల బాగా నచ్చింది శుచీశుభ్రతతో కళకళలాడుతోంది. అమ్మ లోపలికి అడుగు పెడుతుండగా ఆవులు రావద్దు అన్నాయి.నేను లక్ష్మిని,నా రాకకోసం సమస్త జీవులు కోరుకుంటున్నారు అలాంటిది మీరు వద్దు అంటున్నారు, ఆవులు తిరస్కరించిన దేవతలను నేను ఆదరించను అని శ్రీ మహా విష్ణువు చెప్పారు అని ఆవులతో అన్నది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్యకు చేరుకున్న రాముడు కూడా దీపావళి వేడుకల్లో మమేకమైనట్లు రామాయణంలో చెప్పబడింది. అమ్మా లక్ష్మీదేవి నీవు చెంచలవు మాకు వేటిమీద కూడా ఆశలేదు కావున అలా అన్నాము తల్లీ అని గోవులు అన్నాయి. రా అమ్మా ఇంట్లోకి అని ఆహ్వానించి గోవులు సేవించాయి. అమ్మ ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) రోజున ఎవరు సూర్యోదయానికి ముందు ఆవు పేడతో కలిపి చల్లి, గోమూత్రం చల్లి ముగ్గులు వేస్తారో, గోక్షీరంతో పాయసం చేసి నివేదిస్తారో ఆ ఇంటిలో నేను కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందు గోమూత్రం చల్లి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలు వేసి గుమ్మం ముందు ఆవు నెయ్యి దీపారాధన చేసిన ఆ ఇంట కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. మీ సంప్రదాయములను స్థితిగతులను అనుసరించి వీలు అయినంత వరకు యథా శక్తిగా పూజించాలి.
Admin
E Nivas News