Saturday, 13 June 2026 04:21:33 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

కారు చీకట్లో వెన్నెల నింపిన దీపావళి

దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి భూలోకసంచారం

Date : 19 October 2025 06:30 PM Views : 297

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఆశ్వీయుజ మాసంలో కారు చీకట్లలో వెలుగులు నింపే దీపావళి పర్వదినం ఎంతో పవిత్రమైన పండుగ. సోమవారం రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి పూజలు నిర్వహిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. దేవతల కోరిక మేరకు నరకాసురుని సంహరించిన రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పూర్వం కృతయుగంలో ఒకనాడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీమహాలక్ష్మిని లోకశ్రేయస్సు కోసం ప్రార్ధన చేయగా అమ్మ ప్రత్యక్షమై నేను లోక సంచారము చేయటానికి వెళ్తాను అని ఆశ్వయుజ మాసం అమావాస్య నాడు లోక సంచారమునకు వచ్చింది.అమ్మ ఏకకాలంలో లోకమంత నిండిపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా స్నానం లేదు, శుచీ శుభ్రత లేదు. అలా వెళ్తున్న అమ్మకు కశ్యప ప్రజాపతి గోశాల బాగా నచ్చింది శుచీశుభ్రతతో కళకళలాడుతోంది. అమ్మ లోపలికి అడుగు పెడుతుండగా ఆవులు రావద్దు అన్నాయి.నేను లక్ష్మిని,నా రాకకోసం సమస్త జీవులు కోరుకుంటున్నారు అలాంటిది మీరు వద్దు అంటున్నారు, ఆవులు తిరస్కరించిన దేవతలను నేను ఆదరించను అని శ్రీ మహా విష్ణువు చెప్పారు అని ఆవులతో అన్నది. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తర్వాత అయోధ్యకు చేరుకున్న రాముడు కూడా దీపావళి వేడుకల్లో మమేకమైనట్లు రామాయణంలో చెప్పబడింది. అమ్మా లక్ష్మీదేవి నీవు చెంచలవు మాకు వేటిమీద కూడా ఆశలేదు కావున అలా అన్నాము తల్లీ అని గోవులు అన్నాయి. రా అమ్మా ఇంట్లోకి అని ఆహ్వానించి గోవులు సేవించాయి. అమ్మ ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) రోజున ఎవరు సూర్యోదయానికి ముందు ఆవు పేడతో కలిపి చల్లి, గోమూత్రం చల్లి ముగ్గులు వేస్తారో, గోక్షీరంతో పాయసం చేసి నివేదిస్తారో ఆ ఇంటిలో నేను కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. ఇవి చేయలేని వారు సూర్యోదయానికి ముందు గోమూత్రం చల్లి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలు వేసి గుమ్మం ముందు ఆవు నెయ్యి దీపారాధన చేసిన ఆ ఇంట కొలువై ఉంటాను అని అమ్మ వరం ఇచ్చింది. మీ సంప్రదాయములను స్థితిగతులను అనుసరించి వీలు అయినంత వరకు యథా శక్తిగా పూజించాలి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :