Thursday, 30 July 2026 08:38:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ 'ఉపాధ్యాయుల' వృత్తిని అవమానపర్చడానికే...!

Date : 11 March 2026 01:55 PM Views : 569

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రిపోర్ట్ విద్యా ప్రమాణాలను పెంపొందించడానికా? లేక ఉపాధ్యాయుల వృత్తి గౌరవాన్ని దెబ్బతీయడానికా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. *కమిషన్ లక్ష్యం సంస్కరణల పేరిట నియంత్రణ?* కమిషన్ ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టింది. ఉపాధ్యాయుల పనితీరు అంచనా, హాజరు పర్యవేక్షణ, బదిలీలు, నియామకాల్లో కఠిన నియంత్రణ, విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల విలువ నిర్ణయం, విద్యను కేవలం గణాంకాలకే పరిమితం చేసి, ఉపాధ్యాయుడిని "ఫలితాల యంత్రం"గా చూడటం వృత్తి గౌరవాన్ని తగ్గించే చర్యగా భావిస్తున్నారు. *ఉపాధ్యాయుని పాత్రను సంకుచితం చేయడం* ఒక ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. ఆయన మార్గదర్శి, విలువల బోధకుడు, సమాజ నిర్మాణ శిల్పి, కానీ నివేదికలో ఉపాధ్యాయుని పాత్రను పరీక్ష ఫలితాలకే పరిమితం చేసినట్లు భావన కలుగుతోంది. విద్యార్థి కుటుంబ పరిస్థితులు, సామాజిక అసమానతలు, భాషా సమస్యలు ఇవి ఉపాధ్యాయ నియంత్రణలో ఉండవా? అని ప్రశ్నిస్తున్నారు. *పరిపాలనా భారం బోధనకు అడ్డంకి* నివేదికలో సూచించిన కొన్ని చర్యలు నిరంతర డేటా ఎంట్రీలు యాప్‌ల ద్వారా రోజువారీ నివేదికలు, ఎన్నికల డ్యూటీలు, సర్వేలు, ఇతర ప్రభుత్వ పనులు వల్ల బోధన సమయం తగ్గిపోతుంది. విద్యా నాణ్యతపై ప్రతికూల ప్రభావం. ఉపాధ్యాయులు అంటున్నారు. “మాకు బోధన బాధ్యత ఇవ్వండి, కాగితాల బాధ్యత కాదు". *అవిశ్వాస సంస్కృతి గౌరవానికి గాయం* బయోమెట్రిక్ హాజరు, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలు ఉపాధ్యాయులపై అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయనే భావన ఉంది. నమ్మకం లేకుండా విద్యా వ్యవస్థ నిలబడదు. గౌరవం లేకుండా ఉపాధ్యాయుడు ప్రేరణ కోల్పోతాడు. *వృత్తి గౌరవంపై ప్రభావం* ఉపాధ్యాయ వృత్తి భారతీయ సంస్కృతిలో అత్యున్నత స్థానం పొందింది. "గురు బ్రహ్మా, గురు విష్ణుః" అనే భావన సమాజ నిర్మాణంలో గురువు కీలక పాత్ర, కానీ అధిక నియంత్రణ, అనవసర అంచనాలు వృత్తిని ఉద్యోగంగా మాత్రమే చూపించే ప్రమాదం ఉంది. *కమిషన్ ఉద్దేశ్యం.... అమలు లోపాలు* న్యాయంగా చూస్తే కమిషన్ లక్ష్యాలు చెడ్డవి కావు, విద్యా నాణ్యత పెంపు, బాధ్యతాయుత వ్యవస్థ, పారదర్శకత సమస్య ఎక్కడ? అనేది కావాలి. అమలులో ఉపాధ్యాయుల అనుభవం, వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి రాకపోవడం గమనించాలి. *పరిష్కార మార్గాలు* ఉపాధ్యాయ గౌరవాన్ని కాపాడుతూ సంస్కరణలు చేయాలంటే ఉపాధ్యాయులతో సంప్రదింపు, విధానాల రూపకల్పనలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం అవసరం. బోధనకు ప్రాధాన్యం అనవసర పరిపాలనా పనుల నుంచి ఉపాధ్యాయులను విముక్తి చేయాలి. సమగ్ర మూల్యాంకనం విద్యార్థి అభివృద్ధి, కేవలం మార్కులు కాదు. విశ్వాస ఆధారిత వ్యవస్థ పర్యవేక్షణ కంటే ప్రోత్సాహం అవసరం.

*తెలంగాణ విద్యా కవిషన్ లోపాలు* తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ఉపాధ్యాయుల వృత్తిని అవమానించడమే అని తేల్చి చెప్పడం సరళీకరణ అవుతుంది. కానీ, నివేదికలోని కొన్ని సూచనలు ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అమలైతే, అది విద్యా వ్యవస్థకే ప్రమాదం. ఉపాధ్యాయుడిని అనుమానంతో కాక, విశ్వాసంతో చూడాలి. సంస్కరణలు నియంత్రణగా కాక, సాధికారతగా మారాలి. అప్పుడే విద్య వ్యవస్థ తీరు మెరుగుపడుతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చిన రాజకీయ కోణంలోకి వెళ్లి చూడకూడదు. ఉపాధ్యాయులను కించపరిచేలా మాట్లాడుతూ వ్యవహరించడం ప్రభుత్వాలకు తగదు. మరి అసహ్యంగా చూడవాల్సిన అంశమేమిటంటే 'టీచర్లకు' జీతలెక్కువ అనడం పరిపాలకులకు మంచిదికాదు. ఏదేమైనా రాజకీయ నాయకులకు ఒక్కసారి రాజకీయ పదవిలోకి వస్తే జీవితాంతం పెన్షన్ కావాలి అంటారు. అదే ప్రభుత్వ ఉద్యోగికి మాత్రం మీకు పెన్షన్లు ఎందుకు అంటారు. ఇదెక్కడి న్యాయం. ఇది ముమ్మాటికీ టీచర్లపై అక్కసును వెళ్ళి బుచ్చాడమే అవుతుంది. *విద్యా వ్యవస్థ మార్పులో టీచర్లు అక్కర్లేదా!* విద్య వ్యవస్థలను మెరుగుపరచాలంటే ఉపాధ్యాయులు కమిటీలో ఉండేలా చూసుకోవాలి. కానీ ఐ ఏ ఎస్ లు, ఐ పి ఏస్ లు, రాజకీయ నాయకులు కాదు, విద్యావ్యవస్థలో లోటు పాట్లు చూసేది. ఇది పూర్తిగా టీచర్ల ఆత్మాభిమానాన్ని చంపడమే అవుతుంది. ఇకనైనా విద్యా కమిషన్ రిపోర్ట్ లోని అంశాలను మరొకమారు పునః పరిశీలన చేసి అధ్యాపకులపై మంచి వాతావరణం కల్పించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి అధ్యాపక లోకానికి భస్మం కాకండి. టీచర్లు, ఉద్యోగస్తులు హక్కులను కాలరాస్తే రానున్న రోజుల్లో ప్రభుత్వాలు పాతాళ గర్భంలో కలిసిపోక తప్పదు. గత ప్రభుత్వాలు ఇలా చేస్తేనే కనుమరుగైoది. మురళి కమిషన్ రిపోర్ట్ ను తెలంగాణ ముఖ్యమంత్రి చూసి అందులోని అపసవ్యాలను గుర్తించి మంచి విద్యా వ్యవస్థను తయారు చేయాల్సిందిగా అధ్యాపకులు వినమ్రతతో వేడుకుంటున్నారు. ---డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: