ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల నియోజకవర్గంలో శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని తిలక్ నగర్ నుండి బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రేగుంట వెంకటేష్ వారు దాదాపు 150 మంది యువకులతో శనివారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరినీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News