ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఈనెల 4న ఉదయం 7 గంటల కు ప్రారంభమై మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు నుండి శ్రీపాదచౌక్, అంబేద్కర్ విగ్రహం మీదుగా బస్ డిపో నుండి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల మీదుగా ఎస్ బి ఐ బ్యాంకు నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం విజయవంతం చేయగలని ఎం సి పి ఎఫ్ ప్రెసిడెంట్ ఐతు డేవిడ్ ఒక ప్రకటనలో కోరారు. రన్ ఫర్ జీసస్ అనంతరం బేతేల్ గాస్పల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఎరుకల గూడెం ఆవరణంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ హెల్త్ క్యాంపులో మందులు ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. ఈ అవకాశాన్ని మంథని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంథని నియోజకవర్గ పాస్టర్స్ సహవాస అధ్యక్షులు ఐతు డేవిడ్ కోరారు.
Admin
E Nivas News