ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహాశివరాత్రి మహా జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యుత్ దీపాల మధ్య అలంకరించారు. దీంతో ఆలయాలన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెలంగాణలోప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లో నూతన నిర్మాణ పనులు నడుస్తున్నందున భీమేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 14,15,16 మూడు రోజులపాటు మహా జాతర జరగనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు వన్వే ఏర్పాటు చేయడంతో పాటు వీఐపీ ప్రత్యేక దర్శనాలను బ్రేక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా లక్షలాది మంది భక్తులు ఇప్పటికే వేములవాడకు చేరుకోవడంతో ధర్మసత్రాలతో పాటు ప్రైవేటు సత్రాలు కూడా పూర్తిస్థాయిలో భక్తులతో నిండిపోయి పురవీధులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు రూములు దొరకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ సిబ్బంది తోపాటు పోలీసులు కూడా భక్తులకు సేవలందించనున్నారు. వచ్చిన భక్తులకు ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. అలాగే దేవుడికి కోడలు కట్టడానికి ఇప్పటినుండి భక్తులు క్యూ లైన్లు వేల సంఖ్యలో వేసి చూస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనానికి కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Admin
E Nivas News