ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యాప్రవైటీకరణ కార్పొరేటుకువ్యతిరేకంగా పోరాడుదాం అని పిడిఎఫ్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఏరియా మహాసభ నిర్వహించారు. పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి. సికిందర్, పి డి ఎస్ యు రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అజ్మీర లాల్ కుమార్, శంకర్ సత్యం, పి డి ఎస్ యు ప్రధాన కార్యదర్శి డి.శ్రీకాంత్ మాట్లాడుతూకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో జ్యోతిష్య శాస్త్రాలను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం విష సంస్కృతిని ముందుకు తీసుకొస్తా ఉంది.దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పాఠశాలలను, కళాశాలలను అభివృద్ధి చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు పాఠశాలలో కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్ నాయకులు కార్తీక్, వంశీ, అంజి. పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సంజయ్, శివరాం, రోహిత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News