ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరగబోయే అసెంబ్లీ సమావేశం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తానని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని,అంతేకాకుండా అనేక సందర్భాలలో, సభలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయించివిద్యను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 3,24,234 బడ్జెట్లో కేవలం విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ విషయంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 7.57 కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం 0.6% కలిపి విద్యారంగానికి 8.2% మాత్రమే కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ ఆవునూరు మురళి ఇచ్చిన నివేదికలో విద్య రంగానికి 18 శాతం నిధులు కేటాయించాలని చూపించినప్పటికీ, ఆ నివేదికను ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య రంగాన్ని కూని చేస్తూ కార్పొరేట్ విద్యకు వత్తాసు పలుకుతున్నా రన్నారు . తక్షణమే ప్రభుత్వం బడ్జెట్ సవరించి విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Admin
E Nivas News