ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు ఆదివారం ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా చర్చిలతో పాటు వారు సిలువలు ఏర్పాటు చేసుకున్న స్థలాల వద్దకు సంధ్యా సమయాన వెళ్లి ప్రత్యేక ప్రార్థనను నిర్వహించారు. ఏసు మళ్లీ పుట్టినరోజు కాబట్టి క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా పర్వదిన వేడుకలను జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 40 రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన క్రైస్తవులు ఈస్టర్ రోజు తమ యొక్క ఉపవాస దీక్షలను ముగించేస్తారు. అలాగే చర్చి ఫాదర్ లు శాంతి సందేశాలను ఇచ్చారు. అనంతరం భక్తి గీతాలు ఆలపించారు.
Admin
E Nivas News