ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మండలములోని వివిధ గ్రామ పంచాయతిల సర్పంచ్, వార్డు సభ్యలకు జరిగే ఎన్నికలలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులకు ఈ నెల 11 న జరగబోవు 2 వ సాధారణ ఎన్నికల దృష్ట్యా శనివారం స్థానిక ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రెండవ విడుత శిక్షణా తరగతులను నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి సేకరణ, ఓటింగ్ కార్య విధానం గురించి రిటర్నింగ్ అధికారుల ఎన్నికల జరిపే తీరుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యం.పి.డి.వో. కే. సరోజ, తహసిల్దార్ ఎ.దిలప్ కుమార్, శిక్షకులు తిరుపతి లు పాల్గొన్నారు.
Admin
E Nivas News