ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల ప్రకారం సాధారణ బదిలీలో బాగంగా తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా మేరీ. జయంతి బాధ్యతలు చేపట్టారు. నేను గతంలో బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి, కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు ప్రెసెంట్ పత్తికొండ నియోజకవర్గంలోనీ, తుగ్గలి పోలీస్ స్టేషన్ కు బదిలీ కావడం జరిగిందన్నారు. మహిళా పోలీసు అధికారిణిగా నియోజకవర్గంలో కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే శాంతి భద్రతల పరిరక్షణలో ఏఎస్ఐ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అని పేర్కొన్నారు. తుగ్గలి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తన వంతు కృషి చేస్తానని, ఎక్కడా కూడా మహిళలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థినులకు మా శక్తి యాప్ ద్వారా, శక్తి టీమ్ ద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.
Admin
E Nivas News