ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా శ్రీ వివేకానంద విద్యావిహర్ హైస్కూల్ కరస్పాండెంట్ & జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ ఆర్ఎస్ఆర్.గోపాల్, ప్రజా సంఘాల నాయకులతో కలిసి,ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆర్ఎస్ఆర్. గోపాల్ మాట్లాడుతూ సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయలను రూపుమాపడానికి మహిళల హక్కుల పరిరక్షణ కొరకు తన జీవితాన్ని దారపోసిన మహామనిషి అని, భారతదేశానికి స్వాతంత్య్రం రాకమునుపే దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి, సామాజిక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే అని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నాగ లింగమయ్య, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ శివలక్ష్మి రెడ్డి, ఎన్.అబ్రహం, పవన్, కె.బాలస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News