Friday, 31 July 2026 07:11:50 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఏపీ ఎన్జీవోస్ ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడుగా ఎస్.సాజిద్ బాష ఏకగ్రీవంగా ఎంపిక

Date : 01 June 2026 07:14 AM Views : 161

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడిగా, ఖజానా శాఖ అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పదవీ విరమణతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష స్థానానికి జిల్లా పర్యవేక్షణ & ఎన్నికల అధికారిగా విచ్చేసిన జిల్లా సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.సాజిద్ బాషా ను ఏకగ్రీవంగా తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడుగా ఎన్నికైన సాజిద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాపై వుంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని తెలిపారు, జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయంగా ఉంటూ, ఉద్యోగుల కోసం 12 వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటన విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డిఎ ల విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు చేయాలనీ, సరెండర్ లీవ్ ప్రకటించాలని, తదితర అంశాలపై అందరితో కలిసి ప్రభుత్వం నుండి సాధిస్తామని అన్నారు. ఎస్.సాజిద్ బాషా ఎన్నిక పట్ల ఏపీ ఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జెఎసి సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :