Saturday, 13 June 2026 02:59:40 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఏపీ ఎన్జీవోస్ ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడుగా ఎస్.సాజిద్ బాష ఏకగ్రీవంగా ఎంపిక

Date : 01 June 2026 07:14 AM Views : 123

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడిగా, ఖజానా శాఖ అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పదవీ విరమణతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష స్థానానికి జిల్లా పర్యవేక్షణ & ఎన్నికల అధికారిగా విచ్చేసిన జిల్లా సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.సాజిద్ బాషా ను ఏకగ్రీవంగా తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడుగా ఎన్నికైన సాజిద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాపై వుంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని తెలిపారు, జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయంగా ఉంటూ, ఉద్యోగుల కోసం 12 వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటన విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డిఎ ల విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు చేయాలనీ, సరెండర్ లీవ్ ప్రకటించాలని, తదితర అంశాలపై అందరితో కలిసి ప్రభుత్వం నుండి సాధిస్తామని అన్నారు. ఎస్.సాజిద్ బాషా ఎన్నిక పట్ల ఏపీ ఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జెఎసి సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :