Friday, 31 July 2026 07:08:51 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకం

సామాజికవేత్త, బీసీ సంఘం నేత డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య

Date : 11 January 2026 07:46 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : బ్రిటిష్ వారిపై వడ్డె ఓబన్న పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ డి.నాగన్న, ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య అన్నారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని, బీసీ సంఘం కార్యాలయంలో రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య, ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగుల తిమ్మయ్య, ఏపీ వడ్డెర యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు మౌలాలి, సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామాజిక వేత్త డాక్టర్ డి.నాగన్న, రామకృష్ణ, వీరన్న, వెంకటస్వామి గౌడ్, ఈ.శివన్న గౌడ్, రమణ, శివ తదితరులు వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, వడ్డె ఓబన్న పోరాట స్పూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామజిక వేత్త డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ రేనాటి వీరుడు, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న స్ఫూర్తిని బీసీలు ఆదర్శంగా తీసుకొని తమ హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. బీసీలు సంఘటితమై అందులోని కులాల హక్కులు ఐక్యమత్యంతో సాధించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి బీసీలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఓర్సు రామసుబ్బయ్య మాట్లాడుతూ వడ్డె ఓబన్న 1807, జనవరి-11న నంద్యాల జిల్లా సంజామల ప్రాంతంలో రేనాటి గడ్డపై జన్మించారని, ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కి సైన్యానికి సైన్యాధ్యక్షునిగా ఉంటూ రైతు బట్వారీ వ్యవస్థపై బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి వీరమరణం పొందారని గుర్తు చేశారు. వడ్డె ఓబన్న బోయలను, చెంచులను, అణగారిన వర్గాలను సమన్వయం చేసుకొని బ్రీటీష్ పాలకులపై పోరాటాల చేసి ధీటుగా బదులిచ్చిన వీరుడని కొనియాడారు. వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకొని వడ్డెరులు తమ హక్కుల సాధనకై ఉద్యమించాలని సూచించారు. అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. వడ్డెరులు ఐక్యమత్యంతో మెలగాలని, వడ్డె ఓబన్న విగ్రహాలను ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు చంద్రగిరి మల్లేష్, పల్లపు హుశేనయ్య, బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ సింగ్, శ్రీహరి, పెద్దన్న, శ్రీరామ్, శివపాములేటి, వెంకటేశ్వర నాయక్, ఆత్మకూరు డివిజనల్ ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దూదేకుల మీరాసాహెబ్, మరాఠి సంఘం జిల్లా అధ్యక్షులు రేకంధర్ సాయికృష్ణ, వైసీపీ నాయకులు మాబాష తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :