ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీ బాగ్ ఓడంబడిక ఒప్పందాన్ని అమలు చేయాలని వాకర్స్ అసోసియేషన్ మరియు సామాజిక రాయలసీమ ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని, పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్లే కార్డులు పట్టుకొని, ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు & సామాజికవేత్త డాక్టర్ డి.నాగన్న మాట్లాడుతూ శ్రీ బాగ్ ఒప్పందం జరిగి నేటికీ దాదాపుగా 90 సంవత్సరాలు అయిందన్నారు. ఈ ఒప్పందంలోని 4 అంశాలు ఏ ఒక్కటి ఇంతవరకు రాయలసీమ ప్రజలు సాధించుకోవడంలో విఫలమైనారనీ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ బాగ్ ఒప్పందంలోని అంశాలు అనంతపురంలో యూనివర్సిటీ కేంద్రాన్ని స్థాపించాలనీ, కృష్ణ, తుంగభద్ర జలాలలో రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనీ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైకోర్టు గాని రాజధాని గాని రాయలసీమ ప్రజలు ఏది కోరితే అది ఇవ్వాలనీ, రాయలసీమ ప్రాంతంలో నియోజకవర్గాలను పెంచి, కోస్తా జిల్లాలతో సమానంగా ఎమ్మెల్యే స్థానాలు ఉండేవిధంగా చూడాలనీ ప్లే కార్డులో పట్టుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ - గంజి.రాజశేఖర్, లలిత సీడ్స్ ప్రోప్రెటర్- శ్రీనివాసులు గౌడ్, లాయర్ నూర్ అహమ్మద్, భాస్కర్ రెడ్డి, గోవర్ధన్, రమేష్ బాబు, రఫిక్, టీచర్ రఘుస్వామి, వెంకటేష్, సీనియర్ జర్నలిస్టు సుబ్బారెడ్డి, సెరికల్చర్ అధికారి సుంకన్న, నాగేష్, రాయలసీమలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News