ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సభకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై.నరసింహులు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కామ్రేడ్ చిట్టిపాటి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయాన్ని, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తూ, దేశ సంపదను ఖనిజ వనరులను కార్పోరేట్ల చేతులలో పెడుతూ, రెండోవైపు కార్మికులకు పని గంటలు పెంచుతూ, పెట్టుబడిదారులకు కట్టు బానిసలను కావించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే మన ముందున కర్తవ్యమని ఆయన అన్నారు. ప్రతిఘటన పోరాట నిర్మాత, విప్లవోద్యమ అగ్ర నాయకులు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా వెంపెంటలో జరిగిన సభలో అయన ఉపన్యాసించారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి వెలుగోడులో జన్మించి, ఇంజనీరింగ్ విద్యను మధ్యలో వదిలేసి విప్లవొద్యమానికి అంకితం అయ్యారన్నారు.1952లో నందికొట్కూరు శాసనసభ్యులుగా రాయలసీమ కరువుకాటకాలపైన, నీటి సమస్యలపైన మద్రాస్ అసెంబ్లీలో ఏడు గంటలు సుదీర్ఘ ఉపన్యాసం చేశారన్నారు. పేద ప్రజల భూముల కోసం వారి హక్కుల కోసం పోరాడి తంగడంచ, రాపులచెరువు1000 ఎకరాలు పగిడ్యాల, లక్ష్మాపురం తదితర గ్రామాలకు పంపిణీ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. భూమి భుక్తి -విముక్తి కోసం సాయుధ పోరాటమే మార్గమని భావించి 1969 నవంబర్-9 వ తేదీన గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో సాయిద దళాలు నిర్మించారు. ఆ సిద్ధాంత వెలుగులో గోదావరి లోయ ఇరువైపులా ఐదు లక్షల ఎకరాలు అటవీ భూములను ఆదివాసులు పంపిణీ చేసుకోవడంలో ఆయన కీలక భూమిక వహించారు. కర్నూలు జిల్లా కార్యదర్శిగాను, రాష్ట్ర కమిటీ సభ్యుడిగాను, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గాను అంచలంచలుగా ఎదిగి విప్లవొద్యమానికి నాయకత్వం వహించారు. భారత దేశంలో చీలికలు గురైన విప్లవోద్యమాన్ని ఐక్యం చేయడంలో మహత్తరమైన కృషిని కొనసాగించారని అన్నారు. దానిలో భాగంగా చర్చలకు బెంగాల్ వెళ్లి గుండెపోటుతో నవంబర్-9వ తేదీన అమరులయ్యారు. భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను ప్రతిపాదికగా ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయడమే కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి కి మనం అర్పించే నిజమైన నివాళిని కామ్రేడ్ చిట్టిపాటీ వెంకటేశ్వర్లు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కే.అరుణ్ కుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఐ ఎఫ్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షులు పి.మజీద్ మియా, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి ఎం.గోపాల్, పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, పి డి ఎస్ యు నంద్యాల జిల్లా కార్యదర్శి రాంబాబు, జిల్లా నాయకులు ఆది, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు ఆనంద్, పిడిఎస్యు నాయకులు మహేంద్ర, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు స్వాములు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే.గోవింద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News