Saturday, 13 June 2026 04:22:25 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

నందికొట్కూరు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పాములపాడు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Date : 10 January 2026 11:39 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడులోనీ, జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం గ్రామ ప్రజల సహకారంతో గ్రామ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నందికొట్కూరు నియోజవర్గం మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి తరిగోపుల నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కురువ.ఎల్లయ్య, ఎస్సై- పి.తిరుపాలు హాజరయ్యారు. మొదటి బహుమతికి స్పాన్సర్లుగా జిల్లా బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ & తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కురువ రమేష్, శ్రీ వివేకానంద విద్యా విహార్ హైస్కూల్ కరస్పాండెంట్ ఆర్.ఎస్.ఆర్.గోపాల్, మమతా క్లినిక్ డాక్టర్ ఎం.రాజు పాల్గొన్నారు. రెండో బహుమతికి స్పాన్సర్లుగా ఎస్విఎల్ రంజిత్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ కురువ నాగరాజు, మూడో బహుమతికి స్పాన్సర్లుగా టైలర్ లింగారెడ్డి, డిష్ రామచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రాహ్మణకోట్కూరు వర్సెస్ లింగాల మధ్య జరిగిన ఇనాగ్రేషన్ మ్యాచ్‌కు రిబ్బన్ కటింగ్ చేసి, క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి, క్రికెట్ పోటీలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కురువ వెంకటేశ్వర్లు, మిట్టకందాల గ్రామ సర్పంచ్ చింతల నారాయణ, వీరారెడ్డి, వెంకటస్వామి, తిమ్మయ్య, బాలస్వామి, యోహాన్, లోకేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, రామ సుబ్బయ్య, పి.హుసేన్ భాష, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ జాల కృష్ణుడు, చెలిమిళ్ళ డేగల.లోకేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :