Friday, 31 July 2026 12:45:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఘనంగా మెగా పిటిఎం 4.0 నిర్వహణ

మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, రహమత్ నగర్‌లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ విజయవంతం

Date : 24 July 2026 10:41 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలం పరిధిలోని, మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల, రహమత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పిటిఎం 4.0) కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సయ్యదా పర్వీన్ బాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ షాహినాజ్, ప్రత్యేక అధికారి ఏ.వి. రమణ, ఏవో, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ఖాజా, రఫీక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు, పిఆర్టియు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ నిర్వహణ ఉద్దేశాన్ని తల్లిదండ్రులకు వివరించారు. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, అడ్మిషన్లు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కానుకలు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, జిఎఫ్ఎల్ఎల్ లీప్ యాప్ వంటి కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, విద్యార్థుల అభ్యాస పురోగతికి తల్లిదండ్రులు ఇంటి వద్ద చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముబీన్ పర్వీన్, బషీర్ అహ్మద్, యస్మీన్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :