ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : షూటింగ్ బాల్ కర్నూలు డిస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కర్నూలు ఔట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 44 వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీనియర్ పురుషుల విభాగంలో మొదటి స్థానం బాపట్ల జిల్లా జట్టు నిల్వగా,రెండవ స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచింది. మూడవ స్థానంలో గుంటూరు జిల్లా జట్టు నిలిచింది. స్త్రీల విభాగంలో అనకాపల్లి జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలవగా, బాపట్ల జిల్లా జట్టు రెండవ స్థానంలో, మూడవ స్థానంలో గుంటూరు జిల్లా జట్టు ,నాలుగవ స్థానంలో కర్నూలు జిల్లా జట్టు నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, రాష్ట్ర షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి జోసెఫ్, జిల్లా ఒలంపిక్ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సునీల్ కుమార్, జిల్లా డ్రాగన్ బోట్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి కృష్ణ లు పోటీలలో గెలపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగ ముని మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే తాము మెచ్చిన క్రీడలను సాధన చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. నేటి ఓటములను రేపటి విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షూటింగ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రమణారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కృష్ణ, జిల్లా షూటింగ్ బాల్ సంఘం కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News