Thursday, 30 July 2026 10:15:18 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నమోదు గడువును పొడిగించాలి

గడువు దగ్గర పడడంతో బిఎల్ఓ ల అగచాట్లు:-అబ్దుల్ రహిమాన్ ఆవాజ్ కమిటీ రాష్ట్ర నాయకుడు

Date : 10 July 2026 09:18 PM Views : 48

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఊహించినంత వేగంగా నడవడం లేదని ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల-14వ తేదీతో ముగిస్తుండడంతో ఓటరు సవరణ నమోదు చేసుకోని వారు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారని కాబట్టి సవరణ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆవాజ్ కమిటీ సభ్యులు స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్, ఇతర నాయకులు మాట్లాడుతూ అనేక చోట్ల ఫారాలు ఎలా నింపాలో తెలియక సతమతమవుతున్న వారికి ఆవాజ్ కమిటీ సభ్యులు అవగాహన పరుస్తూ ఉన్నారని అయినప్పటికీ అనేక చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి ఆలస్యం అవుతుందని, తొందరపాటుకు డిజిటలైజెషన్ పేర్లు తప్పులు పోతున్నాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రత్యేక ఓటు నమోదు చేసుకోవాలి కాబట్టి, మరికొన్ని రోజులు గడువును పొడిగించి ఓటరు నమోదు ప్రక్రియను సజావుగా జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు మహబూబ్ బాషా, ఆయిల్ షఫీ, అబ్దుల్లా, షేక్ షా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :