ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ఎన్నికల కమిషన్ ఊహించినంత వేగంగా నడవడం లేదని ఆవాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఈనెల-14వ తేదీతో ముగిస్తుండడంతో ఓటరు సవరణ నమోదు చేసుకోని వారు ఇంకా చాలామంది మిగిలి ఉన్నారని కాబట్టి సవరణ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆవాజ్ కమిటీ సభ్యులు స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రహిమాన్, ఇతర నాయకులు మాట్లాడుతూ అనేక చోట్ల ఫారాలు ఎలా నింపాలో తెలియక సతమతమవుతున్న వారికి ఆవాజ్ కమిటీ సభ్యులు అవగాహన పరుస్తూ ఉన్నారని అయినప్పటికీ అనేక చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి ఆలస్యం అవుతుందని, తొందరపాటుకు డిజిటలైజెషన్ పేర్లు తప్పులు పోతున్నాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రత్యేక ఓటు నమోదు చేసుకోవాలి కాబట్టి, మరికొన్ని రోజులు గడువును పొడిగించి ఓటరు నమోదు ప్రక్రియను సజావుగా జరిగేటట్లు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ సభ్యులు మహబూబ్ బాషా, ఆయిల్ షఫీ, అబ్దుల్లా, షేక్ షా, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News