Saturday, 13 June 2026 02:58:27 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 05 June 2026 04:55 PM Views : 30

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డు మార్గం ద్వారా అల్లూరు గ్రామం నుండి నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోనీ, మిడ్తూరు రోడ్డులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు సైకిల్‌పై నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య, నాయకులు, అధికారులతో కలిసి 8కెఎం వరకు ప్రయాణించడం జరిగింది. అనంతరం మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. “భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలి. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్‌ను ఆదా చేయడం వంటి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టాలని అన్నారు. ప్రకృతి పరిరక్షణ పట్ల నా నిబద్ధతను కార్యరూపంలో చూపిస్తూ సైకిల్‌పై ప్రయాణించడం ద్వారా ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు యువతకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటమైనది అన్నారు.

“పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ & మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, lనందికొట్కూరు పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, పీఏ- మద్దిలేటి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :