ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో దేశ పోరాటం తెలుగు దినపత్రిక క్యాలెండర్-2036 లను సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడు లు తదితర నాయకులతో, కార్యకర్తలతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, టిడిపి పాములపాడు మండల బిసి సెల్ అధ్యక్షుడు కంభం.మోహన్ గౌడ్ లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం రాకముందు నుండి వార్తాపత్రికలు మారుమూల ప్రాంతాల నుండి ప్రపంచ దేశాల వరకు ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవస్తాయన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా వార్త పత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయన్నారు. ఏ వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలంటే, పై స్థాయికి ఎదగాలంటే పత్రికలే కీలకమన్నారు. ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, విపత్తులు ఏమి జరిగినా కూడా ప్రతి సమాచారం ఈ వార్త పత్రికల ద్వారానే తెలుసుకుంటున్నామన్నారు. కనుక ప్రతి ఒక్కరూ వార్తా పత్రికలను ఆదరించాలని అప్పుడు అవి మన అభివృద్ధికి పూల బాటలు వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూల.లేనిన్ బాబు, బాలస్వామి, శంకర్ రాముల నాయక్, చిన్నదరగయ్య, రామ్మోహన్ రెడ్డి, జనార్ధన్ నాయక్, స్వామినాయుడు గోపాలయ్య గొల్ల.బుజ్జి, బోయ.జనార్దన్, సామన్న నాయక్, డాక్టర్ నరసింహుడు, వెంకటరాముడు, రాంబాబు నాయక్, నరేంద్ర, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News