ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాలలో గ్రామ సర్పంచ్-వి.వరప్రసాద్ పనిచేయని బోరింగ్ లను రిపేరు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలూరు గ్రామ సర్పంచ్ వి.వరప్రసాద్ మాట్లాడుతూ వచ్చే శీతాకాలం, వేసవికాలన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడెక్కడ పనిచేయని బోరింగులు, కుళాయిలు, పైప్ లైన్లు, ఉన్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు రిపేరు చేయించి, నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా గ్రామ పంచాయితీ నీ అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందన్నారు.
Admin
E Nivas News