Thursday, 30 July 2026 04:51:32 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి- నవజాత శిశువు చికిత్సకు ఎల్ ఓ సి ద్వారా రూ. 3,01,192/- లు మంజూరు

ఆపత్కాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజన్న

Date : 01 July 2026 10:39 PM Views : 57

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామంలో కళ్లు కూడా తెరవని ఆ పసికందుకి లోకమేంటో తెలియదు. అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే, ఆ చిన్నారి ప్రాణం ఊపిరి కోసం కొట్టుమిట్టాడింది. ఆత్మకూరు మండలంలోని, నల్లకాలువ గ్రామానికి చెందిన అమరం మనీషా అనే నిరుపేద మహిళకు పుట్టిన నవజాత శిశువు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పుట్టుకతోనే తక్కువ బరువు దానికి తోడు గుండె, ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో ఆ పసిగుడ్డు శ్వాస తీసుకోవడానికే నరకయాతన అనుభవించింది. నరసరావుపేటలోని, లైఫ్ లైన్ హాస్పిటల్ లో కన్నబిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది, మెరుగైన చికిత్స కోసం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబానికి ఏం చేయాలో పాలుపోలేదు. రూపాయి కూడబెట్టే స్తోమత లేక, కళ్లముందే బిడ్డ ప్రాణం విలవిలలాడుతుంటే ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆపద్బాంధవుడిగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి:- ఆ కటిక చీకట్లో వారికి ఆశాకిరణంలా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అండగా నిలిచారు. తమ బిడ్డను బతికించాలంటూ ఆ కుటుంబం తల్లడిల్లుతూ ఆయన్ను ఆశ్రయించగా ఆ తల్లి కడుపు కోతను, పసికందు పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అత్యవసరంగా వైద్య సహాయం అందేలా చొరవ తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయించి, శిశువు వైద్య చికిత్స నిమిత్తం ఏకంగా రూ. 3,01,192/-ల ఆర్థిక సహాయాన్ని ఎల్ఓసి ద్వారా మంజూరు చేయించారు. *కృతజ్ఞతా భావంతో కన్నీటి పర్యంతమైన కుటుంబం ఈ ఆర్థిక సాయం అందడంతో ఆ పసికందుకు మెరుగైన వైద్యం అందుతోంది. డబ్బు లేక వైద్యం ఆగిపోతుందనే భయం నుండి ఆ తల్లిదండ్రులు బయటపడ్డారు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవుడిలా వచ్చి ఆదుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కి ఆ కుటుంబ సభ్యులు చేతులు జోడించి, కన్నీటితో కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :