ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2026 - 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని దానిలో 12వ పిఆర్సి చెల్లింపులు ఇవ్వవలసిన 4 డిఏ ల బకాయిలకు సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని, కనీసం 12వ పి ఆర్ సి పై కనీస ప్రకటన కూడా చేయలేదని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ అన్నారు. ఈ రోజు ఆత్మకూరు పట్టణంలో మీడియాతో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జవహర్ నాయక్ మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఉద్యోగులకు 11వందల కోట్ల బకాయిలు చెల్లించామని,కాగిత రహిత పెన్షన్ తీసుకురానున్నామని, ఈ హెచ్ ఎస్ కమిటీ వేశామని,మహిళలకు సెలవులు ఇచ్చామని గొప్పగా చెప్పారని, కానీ ఇంకా చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలకోసం ఎలాంటి నిధులు కేటాయింపు చేయలేదని, 12వ పిఆర్సి కమిషన్ చైర్మన్ నియామకం గురించి గానీ, దానికి సంబంధించిన నిధులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 4 డీఏ ల గురించి బడ్జెట్ లో కేటాయింపులుగాని, ప్రసంగంలో ఎక్కడ ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని ఆయన తెలిపారు. 12వ పిఆర్సి చైర్మన్, నాలుగు డిఏలు, ఇతర బకాయిల చెల్లింపులపై ఈ బడ్జెట్ లో కేటాయింపు లేకపోతే మరో బడ్జెట్ వరకు ఎదురుచూడాల్సిందేనా అని ప్రశ్నించారు. 12వ పిఆర్సి గడువు పూర్తయి సుమారుగా మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు చైర్మన్ నియామకం గురించి కూడా మాట్లాడకపోవడం పట్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఈ విషయం ప్రభుత్వం గమనించకపోతే భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. పాఠశాల విద్యా రంగానికి సంబంధించి 3,32, 325 కోట్ల బడ్జెట్ లో 32,308 కోట్లు అంటే 9.72 శాతం మాత్రమే కేటాయింపులు చేశారని, గత సంవత్సరం బడ్జెట్ కంటే 0.14% తక్కువ కేటాయింపులు చేయడం ద్వారా ప్రభుత్వ విద్య పట్ల ప్రభుత్వానికి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి రాష్ట్ర బడ్జెట్లలో 30% నిధులు కేటాయించాలని కొఠారి కమీషన్ చెప్పిన సిఫార్సులను ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు ఎలాంటి పొంతనలేదని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు కోసం కేటాయింపు నిధులు కూడా గతం కంటే తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సి చైర్మన్ నియమించాలని, నాలుగు డిఏలు, ఇతర బకాయిలపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే బడ్జెట్ లో విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించే విధంగా సవరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Admin
E Nivas News