Saturday, 13 June 2026 04:29:36 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఎన్టీఆర్ జిల్లాలో ప్ర‌శాంతంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు

ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 23 February 2026 11:46 PM Views : 111

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : - ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమ‌వారం ప్రారంభం కాగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ న‌గ‌రంలోని వివిధ ప‌రీక్షా కేంద్రాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. శార‌దా క‌ళాశాల‌, పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల‌లోని ప‌రీక్షా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నియమావళి ప్రకారం జరుగుతున్నాయా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వ‌ద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, స‌రైన విధంగా హాజరు నమోదు, ఇన్విజిలేటర్ల విధుల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా సమీక్షించారు. పరీక్షా హాళ్లలో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్ష రాయడానికి తగిన డెస్కులు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఫ‌స్ట్ ఎయిడ్ వంటి ఏర్పాట్లు ఉన్నాయని అన్నారు. మాల్ ప్రాక్టీసులను పూర్తిగా నివారించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అనవసరంగా ఎవరూ గుమికూడరాదని, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప‌రీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్షా నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాల‌న్నారు. పరీక్షలను సజావుగా, నిరాటంకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 36,928 మంది మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులు, 39,980 మంది ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు మొత్తం 76,908 మంది విద్యార్థుల‌కు 98 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఉద‌యం 9 గం. నుంచి మ‌ధ్యాహ్నం 12 గం. వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. త‌నిఖీల్లో జిల్లా ఇంట‌ర్మీడియెట్ విద్యాధికారి బి.ప్ర‌భాక‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :