Friday, 31 July 2026 07:29:48 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పాములపాడులో హిందూ సమ్మేళనం విజయవంతం

కులం మన ఇంటి వరకే పరిమితం...! గడప దాటితే మనమంతా హిందువులం

Date : 25 December 2025 11:53 PM Views : 222

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని హిందూ సమ్మేళనం కార్యక్రమం విజయవంతం  అయింది. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిదులు గౌరవనీయులు విరజానంద స్వామీజీ పాల్గొన్నారు. పాములపాడు మండల హిందువులంతా జనార్దన్ రైస్ మిల్ వద్దా స్వామీజీని ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి పూలు చల్లుకుంటూ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ చౌడేశ్వరి దేవాలయం వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. అనంతరం స్వామీజీ దేవాలయంలోకి వెళ్లి శ్రీ చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకొని భరతమాత విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రద్యులైన చేశారు. అనంతరం స్టేజిపై వివిధ రకాల నృత్య కళలను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం శ్రీశ్రీ విరజానంద స్వామీజీ మాట్లాడుతూ స్వశక్త హిందూ స్వాభిమాన్ నిర్మాణం కోసం మరియు ప్రతి హిందువులో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం ఆర్ఎస్ఎస్ అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాలను నిర్మాణము చేస్తూ నేడు 100వ సంవత్సరములోకి అడుగు పెడుతున్న సందర్భముగా కృష్ణానగర్ గ్రామంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించిందని అన్నారు. ప్రతి హిందువులలో ఆత్మ విశ్వాసాన్ని నింపడం కోసం మన గ్రామాలలో మరియు బస్తీలలో హిందుత్వ వాతావరణం నిర్మాణం చేయడం, మత మార్పిడులకు అడ్డుకట్ట వేయడం, మనమంతా హిందువులం, కులం మన ఇంటి వరకే పరిమితం అని. గడప దాటితే మనమంతా హిందువులం అనే భావన నిర్మాణం చేయయడం, మన దేవాలయ వ్యవస్థను కాపాడుకోవడం, సమాజంలో సామాజిక సమరసతను నిర్మాణం చేయడం, కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసుకోవడం మనందరి బాధ్యత అని, ఇదే ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సమ్మేళన నిర్వాహకులు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు-రాయపాటి.మురళీమోహన్, విజయసింహా రెడ్డి, టి ఎన్ ఆర్ నాగరాజు, రాజేష్, రాయపాటి గోవిందు, నర్సపేట రామకృష్ణ, అపర్ణ దీపిక, జూటూరు రమేష్ ఆచారి, సత్యమయ్య, సాయి కృష్ణ, కురువ పుల్లయ్య, నాని రామస్వామి, వివిధ గ్రామాల హిందువులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :